ప్రస్తుతం దేశంలో విమా ప్రయాణం సాధారణంగా మారింది. కానీ చాలా మందికి విమానంలో ఏవి తీసుకెళ్లాలి, ఏవి తీసుకెళ్లకూడదు అనే విషయం స్ తెలియదు. ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్లాక భద్రతా తనిఖీలో వస్తువులు తీసేసేయడం, లగేజీ నుంచి ఐటమ్స్ తీసి వేయడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇండియన్ విమానాల్లో కొన్ని వస్తువులను పూర్తిగా నిషేధించారు.
విమానంలో అత్యంత కఠినంగా నిషేధించినవి ప్రమాదకర వస్తువులు. ఇవి భద్రతకు హానికలిగించే అవకాశం ఉన్నవి కాబట్టి అసలు అనుమతి ఉండదు. అందులో బాంబులు, పేలుడు పదార్థాలు, డైనమైట్, ఫైర్క్రాకర్స్ వంటి ఏ విధమైన విస్ఫోటకాలు ఉండకూడదు. అలాగే ఇండియన్ ఫ్లైట్ల్లో గన్స్, పిస్టల్స్, బుల్లెట్లు, కత్తులు, డగ్గర్లు వంటి ఆయుధాలు పూర్తిగా నిషేధం. సాధారణమైన కత్తెరలు, బ్లేడ్లు, స్క్రూడ్రైవర్ లాంటి పదునైన వస్తువులు కూడా చేతి బ్యాగ్లో పెట్టరాదు. ఇవి తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీలోనే ఉండాలి. క్యాబిన్ బ్యాగ్లో ఉంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాటిని తీసేసేస్తారు.
వీటికి ఒక లిమిట్
తరువాత కీలకంగా గుర్తుంచుకోవాల్సింది ద్రవ పదార్థాల నిబంధనలు. విమానం క్యాబిన్ బ్యాగ్లో ద్రవాలు, జెల్లు, క్రీమ్లు, లోషన్లు, సువాసనలు వంటి వస్తువులు 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు. వాటిని కూడా పారదర్శకమైన ప్లాస్టిక్ పౌచ్లో పెట్టాలి. ఇది అంతర్జాతీయ నియమం, ఇండియాలో కూడా అదే విధంగా అమలు చేస్తారు. నీళ్లు, జ్యూస్, పాలు, స్ప్రేలు వంటి ఏ ద్రావకమైనా పెద్ద బాటిల్గా తీసుకెళ్లడానికి అనుమతి లేదు. స్ప్రేలు, డియోడరెంట్లు, ఎయిర్ ఫ్రెష్నర్లు వంటి ఏరోసాల్ వస్తువులు కూడా ప్రమాదకరంగా భావిస్తారు. ఇవి కూడా ఎక్కువ పరిమాణంలో క్యాబిన్ బ్యాగ్లో నిషేధమే. మందులు, బేబీ ఫుడ్ మాత్రం అవసరమైతే అనుమతిస్తారు కానీ భద్రతా తనిఖీలో చూపాలి.
అగ్గిపెట్టెలు కూడా
ఇంకా ఒక రకమైన నిషేధిత వస్తువులు రసాయనాలు మరియు కాల్చే పదార్థాలు. పెట్రోల్, డీజిల్, కెరసిన్, పెయింట్లు, టర్పెన్ ఆయిల్, లైటర్లు, గ్యాస్ రిఫిల్ బాటిళ్లు వంటి వస్తువులు విమాన ప్రయాణంలో అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు. సాధారణంగా లైటర్ లేదా అగ్గి పెట్టెలు అనుమతించరు. ఇదే విధంగా బ్యాటరీలు కూడా.==పవర్ బ్యాంక్లను చెక్-ఇన్ లగేజీలో పెట్టరాదు, అవి చేతి బ్యాగ్లోనే ఉండాలి. కానీ పెద్ద బ్యాటరీలు లేదా దెబ్బతిన్న లిథియం బ్యాటరీలు అనుమతించరు. అనవసరంగా ప్రమాదం ఏర్పడే వస్తువులు ఏవైనా ఉంటే అవి భద్రతా తనిఖీల్లోనే తిరస్కరిస్తారు.
ఎంత డబ్బులు?
కొంతమంది ప్రయాణం చేస్తూ పెంపుడు జంతువులు, మొక్కలు లేదా కొన్ని ప్రత్యేక వస్తువులు తీసుకెళ్లాలనుకుంటారు. ఇవి కూడా ప్రత్యేక నిబంధనలను అనుసరించాలి. ముఖ్యంగా జంతువుల ఆహారం, రసాయన ఎరువు, కస్టమ్స్కు సంబంధించిన నిషేధిత వస్తువులు అనుమతి లేకుండా తీసుకెళ్లరాదు. అదేవిధంగా రూ. 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే కస్టమ్స్కి తెలియజేయాలి. ఏ రకమైన పాశ్చాత్య ఔషధాలు లేదా కొన్నిచోట్ల నిషేధిత మందులు ఉంటే అవి కూడా అనుమతించరాదు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నియమాలు భారతదేశంలో చాలా కఠినంగా ఉంటాయి. ప్రయాణికుల భద్రత కోసం ఏ చిన్న అనుమానాస్పద వస్తువైనా వెంటనే తీసివేస్తారు.