E-Paper
Advertisement

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
Advertisement
madhya pradesh road accident
madhya pradesh road accident

Madhya Pradesh Road Accident : రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. దిండోరీలోని బంద్ ఝర్ ఘాట్ ప్రాంతంలో ఒక పికప్ వాహనం.. ప్రయాణికులతో వెళ్తూ బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read More : ఝార్ఖండ్ రైలు ప్రమాదం.. మరణించింది 12 మంది కాదా ? అధికారులు ఏమంటున్నారంటే..

Advertisement

ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×