E-Paper
Advertisement

Jharkhand Train Accident : ఝార్ఖండ్ రైలు ప్రమాదం.. మరణించింది 12 మంది కాదా ? అధికారులు ఏమంటున్నారంటే..

Jharkhand Train Accident :  ఝార్ఖండ్ రైలు ప్రమాదం.. మరణించింది 12 మంది కాదా ? అధికారులు ఏమంటున్నారంటే..
jharkhand train accident
jharkhand train accident

Train accident in Jharkhand: ఝార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అసనోల్‌ పరిధి జమ్తారాలో ప్రాంతంలో.. ట్రాక్‌ దాటుతుండగా పలువురిని బంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ప్రయాణికులు లేరని, వారంతా ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీ కొట్టడంతో గాయపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొలుత 12 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. కొద్దిసేపటికే అధికారులు.. ప్రమాదంలో మరణించింది ఇద్దరు ప్రయాణికులని ప్రకటించడం గమనార్హం.

అప్రమత్తమైన రెస్క్యూ, రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వైద్య బృందాలను, అంబులెన్స్ లను తరలించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. బెంగళూరు – యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ డౌన్ లైన్ లో వెళ్తుండగా అదే సమయంలో లైన్ పక్కన పడేసి ఉన్న బ్యాలస్ట్ దుమ్ము ఎగురుతోంది. దానిని చూసి రైలులో మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయనుకున్నాడు లోకో పైలట్. వెంటనే రైలును ఆపేశాడు.

Read More : శాల్యూట్‌ సరిగా చేయలేదు.. ఏసీపీపై జడ్జి ఆగ్రహం

ఏమైందోనని ప్రయాణికులు కూడా కిందికి దిగారు. ఆ సమయంలోనే ఈఎంయూ రైలు ఢీ కొని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ కు 15 కిలోమీటర్ల దూరంగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఝార్ఖండ్ సీఎం చంపయి సోరెన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. “జార్ఖండ్‌లోని జమ్తారాలో జరిగిన దుర్ఘటన నాకు బాధను కలిగించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను ” అని ట్వీట్ చేశారు.

“జమ్తారాలోని కల్జారియా స్టేషన్ దగ్గర రైలు ప్రమాదం జరిగిందన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. భగవంతుడు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఈ కష్ట సమయాలను భరించే శక్తిని వారి కుటుంబాలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అధికారులు అక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.” అని చంపయి సోరెన్ పేర్కొన్నారు.

“ఝార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు ఆకస్మికంగా మరణించారనే వార్త అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. కాగా.. ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అసనోల్ – 7679523874 నంబర్ ను సంప్రదించవచ్చు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×