E-Paper
Advertisement

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..
Advertisement

Smuggler : ఆ స్మగ్లర్ కలప చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండు రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు. ఇలా బయటకు వచ్చి కొన్నిరోజులకే సీఎంతో కలిసి భోజనం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సిధీ జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలప స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని భోజనం కూడా చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాటలు కలిపాడు. ముచ్చటిస్తూ విందు భోజనం ఆరగించాడు.

Advertisement

అసలు విషయం తెలియని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాటల మధ్యలో ఆ దొంగ వీపు కూడా తట్టారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎంతో కలిసి స్మగ్లర్ భోజనం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అరవింద్‌ గుప్తా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్మగ్లర్‌ ఇలా ముఖ్యమంత్రి పక్కనే కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Related News

రణరంగంగా దేశ రాజధాని.. కదంతొక్కిన విద్యార్థులు, రైతులు.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు!

మమ్మల్ని లాగొద్దు.. తక్షణమే విచారించలేం.. బొద్దింకలకు దిల్లీ హైకోర్టు ఝలక్!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Big Stories

Advertisement
×