BigTV English

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : ఆ స్మగ్లర్ కలప చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండు రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు. ఇలా బయటకు వచ్చి కొన్నిరోజులకే సీఎంతో కలిసి భోజనం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.


మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సిధీ జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలప స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని భోజనం కూడా చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాటలు కలిపాడు. ముచ్చటిస్తూ విందు భోజనం ఆరగించాడు.

అసలు విషయం తెలియని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాటల మధ్యలో ఆ దొంగ వీపు కూడా తట్టారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎంతో కలిసి స్మగ్లర్ భోజనం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అరవింద్‌ గుప్తా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్మగ్లర్‌ ఇలా ముఖ్యమంత్రి పక్కనే కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి.


Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×