E-Paper
Advertisement

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : సీఎంతో కలిసి భోజనం చేసిన స్మగ్లర్‌.. ఫోటో వైరల్..

Smuggler : ఆ స్మగ్లర్ కలప చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండు రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చాడు. ఇలా బయటకు వచ్చి కొన్నిరోజులకే సీఎంతో కలిసి భోజనం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల సిధీ జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలప స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన అరవింద్ గుప్తా అనే వ్యక్తి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని భోజనం కూడా చేశాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాటలు కలిపాడు. ముచ్చటిస్తూ విందు భోజనం ఆరగించాడు.

అసలు విషయం తెలియని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాటల మధ్యలో ఆ దొంగ వీపు కూడా తట్టారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీఎంతో కలిసి స్మగ్లర్ భోజనం చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి అరవింద్‌ గుప్తా అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్మగ్లర్‌ ఇలా ముఖ్యమంత్రి పక్కనే కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×