BigTV English

Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు

Drug trafficking: పోలీసుల నుంచి తప్పించుకున్న పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసు నిందితుడు

drug trafficking Accused escaped from police: పంజాబ్‌ డ్రగ్స్‌ రవాణా కేసులోని నిందితుల్లో ఒకరైన జోబంజిత్‌ సింగ్‌ సంధు పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నిందితున్ని కచ్‌లోని భుజ్‌ జైలులో ఉంచారు. అక్కడి నుంచి కేసుకు సంబంధించి కోర్టులో హాజరుపరిచేందుకు అమృత్‌సర్‌కు తరలిచారు. తిరిగి కచ్‌కు వస్తుండగా మార్గం మధ్యలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడు.


దీంతో పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం స్థానిక పోలీసుల సహాయంతో సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అతనిని పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారి వెల్లడించారు.

Read More: సీట్ల లెక్కలు తేల్చండి.. కాంగ్రెస్ కు అఖిలేష్ అల్టిమేటం..


2021లో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 2,988 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. ఈ డ్రగ్స్ విలువ 21000 కోట్లు డాలర్లు ఉంటుందని అంచన. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రిజిస్టరైన ఓ ట్రేడింగ్ కంపెనీ డ్రగ్‌ను దిగుమతి చేసుకుంటుండగా అధికారులు అడ్డుకున్నారు. సెమీ ప్రాసెస్డ్ టాల్క్ రాళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా ముంద్రా పోర్టుకు తీసుకువచ్చినట్లు విచారణలో తేలింది. అహ్మదాబాద్‌, ఢిల్లీ, చెన్నై, గాంధీధామ్‌, గుజరాత్‌లోని మాండ్వీలలోని పలు చోట్ల ఈ ఏజెన్సీలు దాడులు నిర్వహించాయి. ట్రేడింగ్ కంపెనీ యజమానులు ఎం సుధాకర్, ఆయన భార్య జి దుర్గా పూర్ణ వైశాలి సహా పలువురిని అరెస్టు చేశారు. ఏడు సంస్థలు, 42 మందిపై కేసు నమోదు చేశారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×