EPAPER

Assembly bypoll Voting: ఏడు రాష్ట్రాలు..13 అసెంబ్లీ సీట్లకు పోలింగ్

Assembly bypoll Voting: ఏడు రాష్ట్రాలు..13 అసెంబ్లీ సీట్లకు పోలింగ్

Assembly bypoll Voting: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు ఉప పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్ర ఆరు వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాటిలో బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలున్నాయి.


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచారు. దీంతో ఎమ్మెల్యే సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరికొందరు చనిపోవడంతో ఆయా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

వాటిలో బీహార్‌లోని ఒక స్థానం, బెంగాల్‌లో నాలుగు సీట్లు, ఉత్తరాఖండ్‌లో రెండు, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు ఒకొక్కటి కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినవి పది సీట్లు ఉండగా, ఎమ్మెల్యేలు మరణంతో ఖాళీ అయిన సీట్లు మూడు ఉన్నాయి.


ALSO READ: దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం, సంపద లెక్కింపు ఎప్పుడంటే..

ఉదయం 9 గంటల వరకు బీహార్- 9.23 శాతం, హిమాచల్ ప్రదేశ్- 15, మధ్యప్రదేశ్-16.90, పంజాబ్ -10.30, తమిళనాడు-12.94, ఉత్తరాఖండ్-7, బెంగాల్- 11శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. జూలై 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×