Assembly Elections 2026: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీనికితోడు మూడు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
గురువారం అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం వివరాలు మేరకు అస్సాంలో 85.38 శాతం కాగా, 2016 నాటి 84.67 శాతం మునుపటి రికార్డును అధిగమించింది. 2021లో 82.04 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
పుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు తెలిపింది. 2011లో నమోదైన 86.19 శాతం గరిష్ట స్థాయిని అధిగమించింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కేరళలో 78.03 శాతం పోలింగ్ నమోదైంది. 2021లో 76 శాతం మాత్రమే నమోదు అయ్యింది.
అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పెరిగిన పోలింగ్ శాతం
ఉప ఎన్నికలు జరిగిన కర్ణాటకలోని బాగల్కోట్ నియోజకవర్గంలో 68.70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక దావణగెరె సౌత్లో 68.55 శాతం కాగా, నాగాలాండ్లోని కోరిడాంగ్లో 82.21 శాతం, త్రిపురలోని ధర్మనగర్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. మిగతా కమిషనర్లు డాక్టర్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి ఈ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలను లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.