Big Stories

BJP Fifth List: 111మందితో.. బీజేపీ ఐదో జాబితా విడుదల.. స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్

BJP Fifth ListBJP Fifth List: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర అధికార బీజేపీ 111 మందితో ఐదో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలు ప్రముఖలకు సీటు లభించింది. ఈ ఐదో విడత లిస్ట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

- Advertisement -

ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ కల్పించింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా కంగనా బరిలో దిగనున్నారు. కంగనాతోపాటు దృశ్యకావ్యం రామాయం టీవీ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ కు కూడా మీరట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

- Advertisement -

తెలంగాణలో వరంగల్ లోక్ సభ స్థానం నుంచి ఆరూరి రమేష్, ఖమ్మ నుంచి ఎంపీ అభ్యర్థిగా తండ్ర వినోద్ రావును ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అరకు(ఎస్టీ) కొత్తపల్లి గీతా, అనకాపల్లి ఎంపీ సీటు సీఎం రమేష్, రాజమండ్రి- పురంధేశ్వరీ, నర్సీపట్నం- భూపతి రాజు శ్రీనివాస వర్మ, తిరుపతి (ఎస్సీ)- వరప్రసాద్ రావు, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థులగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.

Also Read: Defence Minister Rajnath Singh: భారత్‌లో వీలినం కానున్న పీవోకే.. రాజ్ నాథ్ సింగ్

బీజేపీ విడుదల చేసిన ఈ ఐదో జాబితాలో ఏపీలో ఆరుగురు, తెలంగాణలో ఇద్దరు, గోవా నుంచి ఒకరికి, బిహార్ నుంచి 17 మంది, గుజరాత్ నుంచి ఆరుగురు, హర్యానా నుంచి నలుగురు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు, యూపీ నుంచి 13 మంది, సిక్కిం నుంచి ఒకరికి, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి 18 మంది, జార్ఖండ్ నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి నలుగురు, కేరళలో నలుగురు, రాజస్థాన్ నుంచి 7 మందికి టికెట్లు కేటాయించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News