BigTV English
Advertisement

Bemetera Factory Blast: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

Bemetera Factory Blast: గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

Chhattisgarh Gunpowder Factory Blast(Telugu news live): ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బెమెతెరా జిల్లాలోని గన్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఒకరు మరణించగా.. ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.


భారీ పేలుడు ధాటికి చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని రాయ్ పూర్ ఎయిమ్స్ కు తరలించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న రాయ్ పూర్, దుర్గ్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.

Also Read :11కు చేరిన మృతుల సంఖ్య, ఇంకా శిథిలాల కిందే..


ప్రమాద సమయంలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడిన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్ముకుంది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు.

ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల సహాయం ప్రకటించారు.

Related News

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Big Stories

×