BigTV English

Madhya Pradesh Blast : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

Madhya Pradesh Blast : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
Madhya Pradesh Blast

Madhya Pradesh Blast (current news from India):


మధ్యప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హర్దా పట్టణంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. సుమారు 60 మందికి పైగా తీవ్ర క్షతగాత్రులయ్యారు. ఘటన జరిగిన వెంటనే ప్రాణలను కాపాడుకునేందుకు స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.ఇదే విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.


బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న ఇళ్లలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇవాళ సాయంత్రానికి మృతుల సంఖ్య 9కి చేరింది. 63 మందికిపైగా గాయాలయ్యాయి.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×