E-Paper
Advertisement

Madhya Pradesh Blast : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..

Madhya Pradesh Blast : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..
Madhya Pradesh Blast

Madhya Pradesh Blast (current news from India):

మధ్యప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హర్దా పట్టణంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. సుమారు 60 మందికి పైగా తీవ్ర క్షతగాత్రులయ్యారు. ఘటన జరిగిన వెంటనే ప్రాణలను కాపాడుకునేందుకు స్థానికులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.ఇదే విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న ఇళ్లలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇవాళ సాయంత్రానికి మృతుల సంఖ్య 9కి చేరింది. 63 మందికిపైగా గాయాలయ్యాయి.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×