E-Paper
Advertisement

Corona Virus : కరోనా వైరస్ డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 10 వేల కేసులు..

Corona Virus : కరోనా వైరస్ డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 10 వేల కేసులు..

Corona Virus News : దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 10,158 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ముందురోజు కంటే 30 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 4.42 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు 44,998కి చేరుకుంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. 230 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,42,10,127 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. భారత్‌లో సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారం రోజువారీ సగటు 3,108 కేసులుగా ఉంది.

దేశంలో కొవిడ్‌ ఎండమిక్‌ దశకు చేరుకుందని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రెండువారాలపాటు కేసుల ఉద్ధృతి కొనసాగుతుందని తెలిపింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌, దాని ఉపరకమైన ఎక్స్‌బీబీ.1.16 కారణంగా కేసుల పెరుగుదల వేగంగా ఉంది. కేసులు పెరుగుతున్నా ఆస్ప‌త్రిలో చేరే వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంటోంది. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×