E-Paper
Advertisement

NEET-UG paper leak: నీట్ పేపర్ లీక్.. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ..

NEET-UG paper leak: నీట్ పేపర్ లీక్.. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ..
Advertisement

CBI Arrested Hazaribagh School Principal and his vice in NEET-UG Paper Leak: నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఆలం ఒయాసిస్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

హజారీబాగ్‌లోని NEET-UG పరీక్షకు ప్రిన్సిపాల్ హక్ జిల్లా కోఆర్డినేటర్‌గా ఉండగా, వైస్ ప్రిన్సిపాల్ ఆలం ఒయాసిస్ స్కూల్‌కు సమన్వయకర్తగా ఉన్నారు. వీరిరువురిని అరెస్ట్ చేసిన అనంతరం బీహార్‌కు తరలించినట్లు తెలస్తోంది. ఇక పేపర్ లీకేజీకి సంబంధించి జిల్లాకు చెందిన మరో ఐదుగురిని సీబీఐ ప్రశ్నిస్తోంది.

Advertisement

ఈ విషయానికి సంబంధించి ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహా మరికొందరు ఉపాధ్యాయులను సీబీఐ ప్రశ్నించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. జూన్ 26న, ఎనిమిది మంది సభ్యుల బృందం పాఠశాలను క్షుణ్ణంగా సందర్శించింది.

అదనంగా, ఈ బృందంలోని కొందరు సభ్యులు తమ విచారణలను జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రధాన శాఖకు విస్తరించారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచే బాధ్యత బ్యాంకు మేనేజర్‌దేనన్న నివేదికల కారణంగా ఈ సందర్శన జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

కాగా, నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ కేసులో బీహార్‌లోని పాట్నాకు చెందిన ఇద్దరు వ్యక్తులను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. వారిని మనీష్ కుమార్, అశుతోష్ కుమార్‌గా గుర్తించారు.

Also Read: నీట్‌పై చర్చకు ఇండియా కూటమి డిమాండ్

మే 5న నీట్ యూజీ పరీక్ష జరగగా జూన్ 4 న ఫలితాలు వెలువడ్డాయి. గ్రేస్ మార్కులు విషయంలో ఆందోళనలు నెలకొన్నాయి. అటు గ్రేస్ మార్కుల విషయంతో పాటు పేపర్ లీక్ అంశం దేశమంతటా పాకడంతో నీట్ పరీక్షను రద్దు చేయాలని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. ఆ అంశంపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ ఇవాళ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×