E-Paper
Advertisement

Delhi: ఎబోలా‌పై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్వైజరీ జారీ

Delhi: ఎబోలా‌పై కేంద్రం హెచ్చరికలు.. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో అడ్వైజరీ జారీ
Advertisement

Delhi: ప్రపంచ ఆరోగ్య సంస్థ -WHO ఎబోలా హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు హెచ్చరిక జారీ చేసింది.

ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరికతో ఎబోలా‌పై కేంద్రం అప్రమత్తం

Advertisement

ఎబోలా లక్షణాలు కోసం పటిష్టమైన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఉత్తర్వులు పేర్కొంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సుడాన్ దేశాలలో ఆయా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత్‌లో ఎబోలా కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఎబోలా వైరస్ వ్యాధి కి సంబంధించి చర్యలు అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీవాస్తవ అధ్యక్షతన సమావేశం జరిగింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. అన్ని స్థాయిలలో సన్నద్ధతను కొనసాగించాలని ఆరోగ్య శాఖ సూచన చేసింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారు మొదలు స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్‌లు, కేసుల నిర్వహణ, రెఫరల్ వ్యవస్థలు, ప్రయోగశాల పరీక్షలకు సంబంధించిన విధానాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

ఎబోలా పై హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

2014లో ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో భారత్ విజయవంతమైంది. ఎబోలా సోకినవారికి జ్వరం, నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు కాంగోలోని ఇటూరి, నార్త్ కివు ఉత్తర ప్రావిన్సులలో 51 కేసులు నమోదు అయ్యాయి. ఉగాండాలో రెండు కేసులు నిర్ధారించారు. ఈ వ్యాప్తికి సంబంధించి 139 అనుమానిత మరణాలు, దాదాపు 600 అనుమానిత కేసులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వైరస్ కట్టడికి టీకాలు ఏవీ అందుబాటులో లేవు. వీటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

ALSO READ: మోదీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు, వారికి మాత్రమే చోటు

పలు దేశాల్లో ఎబోలా కేసులు కలకలం రేపుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యానికి సంబంధించి చిన్న సమస్యలు కనిపిస్తే వెంటనే ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణం చేసిన 21 రోజుల్లోగా వ్యాధి లక్షణాలు కనిపిస్తే స్థానిక వైద్య అధికారులకు తెలియజేయాలని సూచించారు.

Related News

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

Big Stories

Advertisement
×