E-Paper
Advertisement

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు  పూర్తిగా దగ్ధం!
Advertisement

Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు యమునా నగర్‌లో వంట గ్యాస్ సిలిండర్ల లీకేజీ కారణంగా సంభవించిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో, పక్కపక్కనే ఉన్న వరుసగా నాలుగు ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఇళ్లలోని విలువైన సామాగ్రి, వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే మొదటి పేలుడు శబ్దానికి స్థానికులు అప్రమత్తమై, ఇళ్లలో నుండి రోడ్లపైకి పరుగులు తీయడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసమైన తీరును చూసి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స!

ఓటు వేరే.. పౌరసత్వం వేరే.. ఎన్నికల సంఘానికి సుప్రీం షాక్!

కర్ణాటకలో ఘోరం.. పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపిన యువకుడు.. ఇదిగో వీడియో!

భ‌ర్త‌ను చంపి రీల్స్ చూస్తూ భార్య ఎంజాయ్.. కొడుకుపై కత్తితో దాడి, కర్ణాటకలో దారుణం

బెంగళూరు సిటీ.. లోదుస్తుల వీరుడు చిక్కాడు, సీసీటీవీ సాక్షిగా

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

ఇస్రోలో సంక్షోభం.. 120 మంది శాస్త్రవేత్తలు రాజీనామా, రంగంలోకి కేంద్రం, కీలక మిషన్ల మాటేంటి?

Big Stories

Advertisement
×