Coimbatore: తమిళనాడులోని కోయంబత్తూరు యమునా నగర్లో వంట గ్యాస్ సిలిండర్ల లీకేజీ కారణంగా సంభవించిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీకై సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఈ పేలుళ్ల ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో, పక్కపక్కనే ఉన్న వరుసగా నాలుగు ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ఇళ్లలోని విలువైన సామాగ్రి, వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే మొదటి పేలుడు శబ్దానికి స్థానికులు అప్రమత్తమై, ఇళ్లలో నుండి రోడ్లపైకి పరుగులు తీయడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసమైన తీరును చూసి బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పేలిన సిలిండర్లు
తమిళనాడులోని కోయంబత్తూరు యమునా నగర్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్లు లీకై పేలాయి. ఈ ప్రమాదంలో వరుసగా నాలుగు ఇళ్లు పూర్తిగా కాలిపోగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. #Coimbatore… pic.twitter.com/NY4xtXC2nn
— BIG TV Breaking News (@bigtvtelugu) July 18, 2026