E-Paper
Advertisement

పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం.. శరీరంపై బుల్లెట్ల వర్షం!

పుల్వామా దాడి మాస్టర్‌మైండ్ హమ్జా బుర్హాన్ హతం.. శరీరంపై బుల్లెట్ల వర్షం!
Advertisement

Hamza Burhan: పుల్వామా దాడి మాస్టర్ మైండ్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న హమ్జా బుర్హాన్ ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. బుర్హాన్ కారులో ఉండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు నిందితులు.. తుపాకులతో పలుమార్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. కాగా పుల్వామా దాడి అనంతరం 2022లో బుర్హాన్ ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. అప్పటి నుంచి అతడు భారత భద్రతా దళాలు మెస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు.

2022లో బుర్హాన్ ను ఉగ్రవాదిగా అధికారికంగా ప్రకటిస్తూ ఆ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని ఖర్బత్ పోరాలోని రత్నిపోరాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తిగా అతడ్ని పేర్కొంది. అతడి పూర్తి పేరు అర్జుమంద్ గుల్జార్ దార్ అలియాస్ హమ్జా బుర్హాన్ గా తెలియజేసింది. పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘అల్ బదర్’ అనుబంధ సభ్యుల్లో బుర్హాన్ కూడా ఒకరని తెలియజేసింది.

Advertisement

Also Read: 300 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. కేరళ ‘కావి’ ఫ్లోరింగ్‌తో.. ఇల్లు ఎప్పుడూ కూలే!

Advertisement

ఇదిలా ఉంటే 2019 జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా లేత్ పోరా వద్ద జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ పేలుడు సంభవించింది. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను.. జైషే మెుహమ్మద్ ఉగ్రవాది ఆదీల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో వచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో భారీ ఎత్తున పేలుళ్లు జరిగి 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు విడిచారు.

Also Read: ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×