E-Paper
Advertisement

Odisha Train Accident: పరిహారం కోసం మోసాలు.. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో దారుణాలు..

Odisha Train Accident: పరిహారం కోసం మోసాలు.. ఒడిశా రైలు ప్రమాద ఘటనలో దారుణాలు..
Advertisement
odisha death bodies

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. వెయ్యి మంది వరకూ గాయపడ్డారు. కొందరి మృతదేహాలను ఇంకా గుర్తించనే లేదు. మార్చురీలో అనాథ శవాలుగా పడున్నాయిప్పుడు. ఇదే విషయాన్ని కొందరు కేటుగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఆ శవం తమ వారిదేనంటూ అధికారులను నమ్మించి.. లక్షల రూపాయల నష్టపరిహారం కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఓ మోసం వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే….

ప్రమాదం జరిగిన రైల్లో తన భర్త ప్రయాణించాడని.. అతని ఆచూకీ తెలీడంలేదంటూ ఓ మహిళా పోలీసులను ఆశ్రయించింది. అయ్యో పాపం అనుకున్న పోలీసులు.. తమ దగ్గర ఉన్న ఫోటోల్లో ఆమె భర్త ఉంటే గుర్తించాలని కోరారు. వాళ్లిచ్చిన ఫోటోలను చూసిన ఆ మహిళ.. అందులో ఓ ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ.. ఇతనే తన భర్త అని పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె అలా చెబుతూ.. ఏడవడం కానీ, బాధపడటం కానీ ఏమీ చేయకుండా.. చాలా నార్మల్‌గా ఉండటం చూసిన పోలీసులకు ఏదో అనుమానం వచ్చింది. వెంటనే, ఆమె నుంచి అదనపు వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా ఆమె ఉండే ప్రాంత పోలీస్ స్టేషన్‌ను సంప్రదిస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆ మహిళ భర్త బతికే ఉన్నాడని.. అతను అసలు ఆ ట్రైన్‌లోనే జర్నీ చేయలేదని తేలింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. వచ్చిన మహిళను గట్టిగా ప్రశ్నిస్తే.. అసలు విషయం తీరిగ్గా చెప్పింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇస్తోందని తెలిసి.. తాను కావాలనే తన భర్త రైలు ప్రమాదంలో చనిపోయాడని చెప్పానని ఒప్పేసుకుంది.

Advertisement

ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికీ వెళ్లింది. ఒడిశా సీఎస్ ప్రదీప్ కుమార్ స్పందించారు. ఇలాంటి మోసపూరిత చర్యలపై అప్రమత్తంగా ఉంటూ.. కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర పోలీసులకు, రైల్వే అధికారులకు సూచించారు.

శవాలతోనూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల తీరు చర్చనీయాంశమవుతోంది. మోసగాళ్లు ఎప్పటికప్పుడు ఇలా కొత్త ఐడియాలతో ముందుకు వస్తుండటం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×