E-Paper
Advertisement

Air India: మహిళపై మూత్ర విసర్జన.. ఎయిరిండియాకు 30 లక్షల జరిమానా

Air India: మహిళపై మూత్ర విసర్జన.. ఎయిరిండియాకు 30 లక్షల జరిమానా
Advertisement

Air India: ఓ ఉన్నత ఉద్యోగి.. విమానంలో ఫుల్ గా తాగి బుద్ధి మరిచాడు. ఏమాత్రం ఇంగితం లేకుండా ప్రవర్తించాడు. సీట్లో కూర్చొని ఉన్న వృద్ధ మహిళపై మూత్రం పోశాడు. విషయం తెలిసిన విమాన సిబ్బంది స్పందించాల్సిన విధంగా స్పందించలేదు. ఆ మహిళకు వేరే దుస్తులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ తాగుబోతు ప్యాసింజర్ ను వదిలేశారు. కట్ చేస్తే.. నెల తర్వాత విషయం వెలుగు చూసింది. బాధిత వృద్ధురాలు ఎయిర్ ఇండియా ఛైర్మైన్ కు లేఖ రాయడం.. అది కాస్తా DGCA దృష్టికి వెళ్లడం.. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం.. నిందితుడి అరెస్ట్.. వరుసగా జరిగిపోయాయి. విషయం తెలిసి నిందితుడు శంకర్ మిశ్రాను ఉద్యోగంలోంచి తీసేసింది కంపెనీ. లేటెస్ట్ గా, ఈ కేసులో మరోమారు యాక్షన్ మొదలైంది.

ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎయిర్ ఇండియాపై.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) చర్యలు తీసుకుంది. 30 లక్షల జరిమానా విధించింది. విమాన పైలట్‌ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్‌కు 3 లక్షల పెనాల్టీ కట్టాలని ఆదేశించింది.

Advertisement

ఘటనలో ఎయిరిండియా సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆ సమయంలో విమానంలో ఉన్న కెప్టెన్‌, క్యాబిన్‌ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు ఇప్పటికే చేపట్టింది ఎయిరిండియా. నిందితుడు శంకర్‌ మిశ్రా.. నాలుగు నెలల పాటు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. తాజాగా, ఎయిరిండియాపైనే DGCA చర్యలు తీసుకోవడం మరింత ఆసక్తికరం.

Tags

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×