E-Paper
Advertisement

Bullet Train : ఏమిటీ బుల్లెట్ ట్రైన్ కారిడార్?

Bullet Train : ఏమిటీ బుల్లెట్ ట్రైన్ కారిడార్?
Bullet Train Project In India

Bullet Train Project In India (today news telugu) :

రెండు గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరొచ్చు. ఈ మేరకు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీసేలా ఈ కారిడార్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా బిలిమోర-సూరత్ మధ్య తొలి 50 కిలోమీటర్ల మేర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఈ పనులు పూర్తవుతాయని నిరుడు కేంద్రం ప్రకటించింది.

ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు 2021 నవంబర్‌లో ఆరంభమై శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనుల పురోగతికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఆధునిక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గురించి వివరాలను ఆ వీడియో ద్వారా వెల్లడించారు. భవిష్యత్తు భారతంగా ఆ ప్రాజెక్టును అభివర్ణించారు కేంద్ర మంత్రి. ఈ బుల్లెట్ ట్రైన్ రూట్‌లో అదనంగా 24 నదీబ్రిడ్జిలను, 28 స్టీల్ బ్రడ్జిలను నిర్మిస్తున్నారు.

Read more : పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా

భారతీయ రైల్వే తన ఆపరేషన్లను ఆరంభించే సరికి.. ఈ రూట్‌లో 35 బుల్లెట్ ట్రైన్లు నడుస్తాయి. ఇవి రోజుకు దాదాపు 70 ట్రిప్పులు తిరుగుతాయి.

2050 నాటికి బుల్లెట్ రైళ్ల సంఖ్యను 105కి పెంచుతారు. అప్పటికి ఏటా 1.6 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా. ఇవీ విశేషాలు..

  • కేంద్రమంత్రి వీడియో ప్రకారం.. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా శ్లాబ్ ట్రాక్ సిస్టమ్ ను వినియగిస్తున్నారు.
  • భూకంపాలను ముందుగానే గుర్తించగలిగే వ్యవస్థను బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో ఏర్పాటు చేస్తారు.
  • ఈ రూట్ కోసం పర్వతమార్గంలో 7 టన్నెళ్లు ఉంటాయి.
  • ప్రాజెక్టులో సముద్ర టన్నెల్ కూడా ఓ భాగం. దీని పొడవు 7 కిలోమీటర్లు.
  • ఈ కారిడార్‌లో 12 అత్యంత అధునాతన రైల్వే స్టేషన్లను నెలకొల్పుతున్నారు.
  • అంచనా వ్యయం మొత్తం రూ.1.08 లక్షల కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.10 వేల కోట్లు. గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రూ.5 వేల కోట్ల చొప్పున భరిస్తాయి.
  • మిగిలిన మొత్తాన్ని జపాన్ రుణంగా అందిస్తోంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×