E-Paper
Advertisement

Application for Free Electricity: పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా..!

Application for Free Electricity: పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా..!

Application for free electricity Scheme: సౌర విద్యుత్‌ వినియోగాన్ని విస్తరించెందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన ’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ లక్ష్యంతో సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించే అవకాశం ఉంది. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లై చేసుకోవాలి. ఈ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం ఏలా అప్లై చేసుకోవాలో ఆ వివరాలను వెబ్‌సైట్‌లో వివరించారు.

దరఖాస్తు ప్రక్రియ వివరాలు..

ఇందులో ముందుగా ఈ పోర్టల్లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవడం కోసం ముందుగా మీ రాష్ర్టంతో పాటు విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. తరువాత దానికి సంబంధించిన మొబైల్‌ నంబరు, కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని అందులో ఎంటర్ చేయాలి. పోర్టల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.. వాటి ప్రకారమే మీరు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.

ఆ తర్వాత ముందుగా మీరు నమోదు చేసిన కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. లాగిన్ తరువాల అందులో మీరు ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలు సరిగ్గ ఉంటే మీ దరఖాస్తును వెబ్‌సైట్‌ అనుమతిస్తుంది. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లో మీరు నమోదు చేసిన విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత. ఆ ప్లాంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో ఎంటర్ చేసి.. నెట్ మీటర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెట్ మీటర్ దరఖాస్తును డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. ఆ తరువాత పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌‌ను జారీ చేస్తారు. అనంతరం మీ బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్‌ చెక్‌ పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన 30 రోజు గడువులోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×