E-Paper
Advertisement

Application for Free Electricity: పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా..!

Application for Free Electricity: పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా..!
Advertisement

Application for free electricity Scheme: సౌర విద్యుత్‌ వినియోగాన్ని విస్తరించెందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన ’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ లక్ష్యంతో సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించే అవకాశం ఉంది. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లై చేసుకోవాలి. ఈ ‘రూఫ్‌టాప్ సోలార్’ కోసం ఏలా అప్లై చేసుకోవాలో ఆ వివరాలను వెబ్‌సైట్‌లో వివరించారు.

దరఖాస్తు ప్రక్రియ వివరాలు..

Advertisement

ఇందులో ముందుగా ఈ పోర్టల్లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవడం కోసం ముందుగా మీ రాష్ర్టంతో పాటు విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. తరువాత దానికి సంబంధించిన మొబైల్‌ నంబరు, కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని అందులో ఎంటర్ చేయాలి. పోర్టల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.. వాటి ప్రకారమే మీరు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.

ఆ తర్వాత ముందుగా మీరు నమోదు చేసిన కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. లాగిన్ తరువాల అందులో మీరు ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వివరాలు సరిగ్గ ఉంటే మీ దరఖాస్తును వెబ్‌సైట్‌ అనుమతిస్తుంది. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లో మీరు నమోదు చేసిన విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

Advertisement

సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత. ఆ ప్లాంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్‌లో ఎంటర్ చేసి.. నెట్ మీటర్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెట్ మీటర్ దరఖాస్తును డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. ఆ తరువాత పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌‌ను జారీ చేస్తారు. అనంతరం మీ బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్డ్‌ చెక్‌ పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన 30 రోజు గడువులోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×