BigTV English

Tractor Horrific road accident: రాజ్‌గఢ్‌లో ట్రాక్టర్ బోల్తా, 13 మంది మ‌ృతి.. పెళ్లికి వచ్చి…

Tractor Horrific road accident: రాజ్‌గఢ్‌లో ట్రాక్టర్ బోల్తా,  13 మంది మ‌ృతి.. పెళ్లికి వచ్చి…

Tractor Horrific road accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 13 మంది మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన బాధితులను సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.


బోపాల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి నిమిత్తం రాజస్థాన్ నుంచి 30 మంది మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు వస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటాక పిఫ్లోధిజాద్‌ సమీపంలోకి రాగానే పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది.

అయితే ట్రాక్టర్‌లో ఎక్కువ మంది ఎక్కడంవల్లే ఈ ఘటన జరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ హర్షదీక్షిత్ వెంటనే అధికారులతో మాట్లాడారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.


ALSO READ: సిక్కింలో రెండోసారి అధికారంలోకి SKM.. గురువును మళ్లీ ఓడించిన శిష్యుడు

ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×