E-Paper
Advertisement

Karnataka Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. ఈసీకి ఫిర్యాదులు..

Karnataka Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.. ఈసీకి ఫిర్యాదులు..
Advertisement

Karnataka Elections : కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ పతాక స్థాయికి చేరింది. రాష్ట్రంలో ఎన్నికలకు వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార , ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. పోటా పోటీగా హామీలు గుప్పించాయి. బీజేపీ ముస్లింల రిజర్వేన్లను రద్దు చేస్తామని ప్రకటించడంతో వివాదం మొదలైంది. భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

భజరంగ్‌దళ్‌ నిషేధంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రజల మధ్య విభజన తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. విశ్వహిందూ పరిషత్‌ యువజన విభాగమైన భజరంగ్‌దళ్‌ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోందని పేర్కొంది. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ విజయం ఖాయమని తేలడంతో కాంగ్రెస్‌ కుయుక్తులకు పాల్పడుతోందని బీజేపీ విమర్శించింది. మరోవైపు కాంగ్రెస్ పై భజరంగ్ దళ్ మండిపడింది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు భజరంగ్ దళ కార్యకర్తలు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.

Advertisement

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లపై చర్య తీసుకోవాలని అజయ్‌ మాకెన్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించింది.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సంయమనం పాటించాలని రాజకీయ పార్టీలకు ఈసీ సూచించింది. కొందరు నేతలు వాడుతున్న భాషను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అన్ని పార్టీలూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×