E-Paper
Advertisement

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?

Lord shiva temple: శివాలయాలన్నీ శివణామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తుల శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట బారులు తీరారు. దేశంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భోళా శంకరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇక ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంచే మధ్యప్రదేశ్‌లోని సోమేశ్వరాలయాన్ని ఆధికారులు ఓపెన్ చేశారు.రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని10వ శతాబ్ధంలో నిర్మించారు. అప్పట్లో ఆ ఆలయాన్ని ముస్లిం రాజులు స్వాధీనం చేసుకొని మూసివేశారు. అయితే ఆలయాన్ని తెరవాలంటూ 1974లో పలువురు హిందువులు ఉద్యం చేయడంతో.. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సేథీ కేవలం మహా శివరాత్రి రోజున మాత్రమే తెరిచి పూజలు చేసేందుకు అనుమతించారు.

దీంతో అప్పటి నుంచి కేవలం శివరాత్రి రోజున మాత్రమే సోమేశ్వరాలయంను తెరిచి పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకొని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజున ఆ శివయ్యను దర్శించుకొని పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని శివరాత్రి రోజున ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి పర్వదనం సందర్భంగా ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×