Car Accident: ఒకే కుటుంబంలో వెలుగులు నింపాల్సిన పండగ వేళ, ఆ ఇంట్లో తీరని శోకం అలముకుంది. ఉజ్జయినిలోని బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని, తమ కష్టాలు తీర్చమని వేడుకోవడానికి బయలుదేరిన ఆ కుటుంబ సభ్యులను విధి జలపాతం రూపంలో బలి తీసుకుంది.
మార్గమధ్యంలో ఊహించని ప్రమాదం
ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లోని జయదేవ్ విహార్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కారులో మధ్యప్రదేశ్ బయలుదేరారు. ప్రయాణం సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో.. మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లా నల్కేద వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. సమీపంలోని లోతైన జలపాతంలోకి వేగంగా దూసుకెళ్లింది.
ఎనిమిది మంది దుర్మరణం
ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పసిపిల్లలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. చిన్న పిల్లలతో సహా కుటుంబమంతా ఇలా ఒకేసారి జలసమాధి కావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలోనే ఆ కుటుంబం అనంత లోకాలకు చేరుకోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్