Bengaluru Knife Attack: అక్కడ ఏం జరుగుతుంది. ఓ అమ్మాయిపై ఓ కిరాతకుడు కత్తితో దాడి చేస్తున్నాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై కూడా అటాక్ చేశాడు. ఇంతకు వాడు ఎవడు.. ఇదీ ఎక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది. ఈ విజువల్స్ ఇప్పడిది కాదు.. కానీ ఈ మధ్యే బయటకు వచ్చింది. బెంగళూరులోని కోడిహళ్లి రోడ్డుపై సరిగ్గా ఈ ఏడాది జులై 13న సాయంత్రం నాలుగున్నరకు లా స్టూడెంట్ అమృత నడుచుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి కత్తితో దారుణంగా నరికేశాడు.
నడిరోడ్డుపై రాక్షసత్వం!
ఇంతకీ ఈ అమ్మాయిని నడిరోడ్డుపై ఎందుకంత కసిగా నరికేశాడు. అదే కదా మీ డౌట్. లా చదువుతూనే ఓ పిజ్జా ఔట్లెట్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తోంది ఈ 22 ఏళ్ల అమృత. ఓ మీటింగ్లో ధనుష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం లవ్గా అప్డేట్ అవ్వడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. అయితే, అసలు సినిమా అక్కడే మొదలైంది. ధనుష్కు ఆల్రెడీ పెళ్లై పాప కూడా ఉంది. కాకపోతే డివర్స్ అయ్యాయి. ఈ నిజాన్ని దాచిపెట్టి అమృతతో లవ్ట్రాక్ నడిపిస్తున్నాడు. ధనుష్ గాడి దరిద్రమైన హిస్టరీ తెలుసుకున్న అమృత షాక్ అయ్యింది. తనదగ్గర నిజం దాచి మోసం చేశాడనే అసహ్యంతో అమృత ఆ వెధవకు, వాడి లవ్కు గుడ్బై చెప్పేసింది.
మోసగాడికి గుడ్బై చెప్పిందని..
కానీ, ఆ మోసగాడికి అస్సలు మింగుడు పడలేదు. ఇంతలో ధనుష్ తమ్ముడు సూర్యగాడు ఎంటరయ్యాడు. మా అన్నే వదిలేస్తావా అంటూ కోపంతో రగిలిపోయాడు. జూలై 13న అమృత డ్యూటీకి వెళ్తుండగా.. దారికాచి వెనుక నుంచి ఎటాక్ చేశాడు ఆ సైకో. కత్తితో ఛాతీపై, వీపుపై విచక్షణారంగా నరికేశాడు. అడ్డుబోయిన ఓ వ్యక్తిపై కూడా ఆ కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
చావు బతుకుల మధ్య 48 గంటలు పోరాటం..
రక్తపు మడుగులో పడిఉన్న అమృతను స్థానికులు హుటాహుటిన ఆటోలో హాస్పిటల్కు తరలించారు. చావు బతుకుల మధ్య 48 గంటలకు పైగా పోరాడిన ఆ లా స్టూడెంట్.. జూలై 15న తుదిశ్వాస విడిచింది. జీవన్ భీమా నగర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇద్దరు అన్నదమ్ములను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఈ సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడంతో అయ్యో అమృత అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!