E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిరం త్వరలో ప్రారంభకానుంది. రాములోరి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలో రామ భక్తుల స్వామివారికి భారీ కానుకలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

గుజరాత్‌ సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా రాములోరి కోసం వజ్రాల కంఠహారం తయారు చేయించారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో ఈ కంఠహారం రూపొందించారు. రామాయణంలోని ముఖ్య పాత్రల చిత్రాలను కంఠహారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఈ హారాన్ని కానుకగా ఇస్తానని కౌశిక్ కకాడియా తెలిపారు.

ఈ కంఠహారం తయారీ కోసం 5 వేల అమెరికన్‌ వజ్రాలతోపాటు 2 కిలోల వెండిని ఉపయోగించారు. హారం తయారీ కోసం 40 మంది కళాకారులు 35 రోజులపాటు శ్రమించారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాను కూడా పొందుపరిచారు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×