E-Paper
Advertisement

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..
Advertisement

Modi : కర్నాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. తాజాగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేపట్టారు. న్యూ తిప్పసాంద్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్‌ వరకు ఈ రోడ్ షో చేపట్టారు.

ప్రధాని చేపట్టిన రెండో రోడ్‌ షో ఇది. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు. నీట్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రెండో రోడ్‌ షోను 10 కిలోమీటర్లతో సరిపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. దక్షిణ కర్ణాటకలో కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా రోడ్‌ షో చేపట్టారు.

Advertisement

ప్రధాని శనివారం 28 కిలోమీటర్లు రోడ్ షో చేశారు. 18 నియోజకవర్గాలను చుట్టేశారు. బాదామి, హావేరిలకు వెళ్లిన మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న బిడ్డ ప్రపంచమే గుర్తించేలా దేశాన్ని నిలబెట్టారంటే అందుకు కారణం తాను కాదని ప్రజలు వేసిన ఓటేనని ప్రకటించారు.

కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సోమవారంతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. అటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×