E-Paper
Advertisement

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..

Modi : ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు.. బెంగళూరులో మోదీ రోడ్ షో..
Advertisement

Modi : కర్నాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారానికి మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. తాజాగా బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేపట్టారు. న్యూ తిప్పసాంద్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్‌ వరకు ఈ రోడ్ షో చేపట్టారు.

ప్రధాని చేపట్టిన రెండో రోడ్‌ షో ఇది. మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు. నీట్‌ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రెండో రోడ్‌ షోను 10 కిలోమీటర్లతో సరిపెట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. దక్షిణ కర్ణాటకలో కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా రోడ్‌ షో చేపట్టారు.

Advertisement

ప్రధాని శనివారం 28 కిలోమీటర్లు రోడ్ షో చేశారు. 18 నియోజకవర్గాలను చుట్టేశారు. బాదామి, హావేరిలకు వెళ్లిన మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న బిడ్డ ప్రపంచమే గుర్తించేలా దేశాన్ని నిలబెట్టారంటే అందుకు కారణం తాను కాదని ప్రజలు వేసిన ఓటేనని ప్రకటించారు.

కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సోమవారంతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. అటు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×