E-Paper
Advertisement

America : అమెరికాలో మళ్లీ కాల్పులు.. 8 మంది మృతి..

America : అమెరికాలో మళ్లీ కాల్పులు.. 8 మంది మృతి..
Advertisement

America : అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడంలేదు. దుండగుల దుశ్చర్యకు అమాయకులు బలి కావడం కామన్ గా మారింది. తాజాగా ఓ మాల్‌లో దుండగుడు విచక్షణారహింతంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు.

టెక్సాస్‌ రాష్ట్రంలోని డల్లాస్‌ నగర శివారు అలెన్‌లోని ప్రీమియర్‌ మాల్‌లో కాల్పుల ఘటన జరిగింది. ఈ సమయంలో షాపింగ్‌ కోసం వచ్చిన వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వ్యక్తి మాల్‌ బయట కారులోంచి దిగాడు. కాల్పులు జరుపుతూ మాల్ లోకి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్పుల ఘటనపై స్థానికులు అలెన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగుడిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. గాయపడిన బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తుపాకీ సంస్కృతికి అమెరికాలో అమాయకులు బలైపోతున్నారు. షాపింగ్ మాల్స్, హోటల్స్, స్కూళ్లు ఇలా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది. కాల్పుల ఘటనలు అమెరికాలో సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ ఒక్క ఏడాదిలోనే సగటున వారానికో ఒక ఘటన జరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా కాల్పుల ఉదంతంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. టెక్సాస్‌ గవర్నర్‌తో మాట్లాడారు.

Tags

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో కీలక మలుపు!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×