BigTV English

Modi : ఆర్థిక నేరస్తులను వేగంగా అప్పగించండి.. బ్రిటన్ ను కోరిన మోదీ..

Modi : ఆర్థిక నేరస్తులను వేగంగా అప్పగించండి.. బ్రిటన్ ను కోరిన మోదీ..


Modi : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇరువురు ప్రధానులు కీలక అంశాలపై చర్చించారు. భారత్‌ వ్యతిరేక శక్తుల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని రిషి సునాక్‌ను మోదీ కోరారు. బ్రిటన్ లోని భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఇటీవల బ్రిటన్ లో భారత హైకమిషన్‌పై జరిగిన దాడిని మోదీ ప్రస్తావించారు. ఖలిస్తానీ అనుకూలవాదులు లండన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేశారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటనలను రిషి సునాక్‌తో మోదీ ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. భారత్ దౌత్య కార్యాలయాల భద్రత విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హామీ ఇచ్చారు.


దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో తలదాచుకుంటున్న వారిని భారత్ కు అప్పగించే విషయంపై చర్చించారు. ఆర్థిక నేరస్తులను అప్పగించే ప్రక్రియలో పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను ప్రధానులు సమీక్షించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే జి-20 సదస్సుకు హాజరుకావాలని రిషి సునాక్‌ను మోదీ ఆహ్వానించారు.

Related News

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Big Stories

×