BigTV English
Advertisement

Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్.. రేపు జూబ్లీ పోలింగ్ ఉంటుందా..?

Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్.. రేపు జూబ్లీ పోలింగ్ ఉంటుందా..?

Delhi Blast: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. ప్రధాన కూడళ్లలో, రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో..  రేపు జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ సజావుగా.. జరుగుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.


ఢిల్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో.. నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా.. ప్రజలు అధికంగా గుమిగూడే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య సముదాయాలు, మాల్స్ వంటి కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన రవాణా కేంద్రాలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రయాణీకుల లగేజీ, రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రముఖ దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద కూడా పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.


జూబ్లీ బైపోలింగ్ పై స్పెషల్ ఫోకస్

పోలీసులు భారీ బందోబస్తు మధ్యే.. రేపు జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఉపఎన్నికల్లో రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరానుండటంతో, పోలింగ్ ప్రక్రియ అంతరాయం లేకుండా, శాంతియుతంగా జరిగేలా చూడటం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఢిల్లీ ఘటన నేపథ్యంలో.. పోలింగ్ బూత్‌ల వద్ద, ఓటర్లు వేచి ఉండే ప్రదేశాలలో అదనపు బలగాలను మోహరించాలని ప్రణాళిక చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు.

పోలీసులు ఇప్పటికే.. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలలో.. ఓటర్లు ఎక్కువగా వచ్చే మార్గాల్లో ముందస్తు తనిఖీలను ప్రారంభించారు. ముఖ్యంగా.. పోలింగ్ సామగ్రిని తరలించే వాహనాలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు సమాచారం.

ALSO READ: Delhi Bomb Blast: దిల్లీ బాంబు పేలుడులో భయానక దృశ్యాలు.. రెండు ముక్కలై కారుపై పడిన మృతదేహం

ప్రస్తుతానికి.. ఢిల్లీ ఘటన తీవ్రత దృష్ట్యా అప్రమత్తత ప్రకటించినప్పటికీ, రేపు జూబ్లీహిల్స్ పోలింగ్ ఎలా జరుగుతుందో చూడాలి. అయినప్పటికీ.. పోలీసులు భద్రతా పరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి, నగరంలో అత్యంత అప్రమత్తత పాటించాల్సిందిగా ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ పరిణామాలు నగరంలో కొద్దిపాటి ఆందోళనను కలిగించినప్పటికీ..  అధికార యంత్రాంగం పరిస్థితిని అదుపులో ఉంచడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది.

Related News

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

Iconic Bridge: హైదరాబాద్‌లో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. టెండర్‌కు అప్రూవల్ ఇచ్చిన ప్రభుత్వం

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Paddy Procurement Record: ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష

Delhi Blast High Alert: దిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్‌.. పలుచోట్ల ముమ్మర తనిఖీలు

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Big Stories

×