E-Paper
Advertisement

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు ధ్వంసం.. 8 మంది మృతి

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు ధ్వంసం.. 8 మంది  మృతి

Delhi Blast:ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ పేలుడు ధాటికి ఆ కారు పూర్తిగా దగ్ధమైంది. అంతేకాకుండా, మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో పార్క్ చేసి ఉన్న  వాహనాలకు కూడా మంటలు అంటుకుని దెబ్బతిన్నట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను పెంచింది.

సోమవారం ఉదయమే ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేయగా, ఢిల్లీ శివారులో ఏడుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయినప్పటికీ పేలుడు సంభవించడంపై ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×