E-Paper
Advertisement

Terrorists Arrest: లేడీ డాక్టర్ సాయంతో తీవ్రవాదుల భారీ ప్లాన్.. 12 సూట్ కేసులు, 20 టైమర్లు, రైఫిల్ స్వాధీనం.. ఎక్కడంటే?

Terrorists Arrest: లేడీ డాక్టర్ సాయంతో తీవ్రవాదుల భారీ ప్లాన్.. 12 సూట్ కేసులు, 20 టైమర్లు, రైఫిల్ స్వాధీనం.. ఎక్కడంటే?

Terrorists Arrest: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే-మొహమ్మద్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మల్ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టు జరిగిన 10 రోజుల తర్వాత హర్యానా, జమ్మూ కశ్మీర్‌లలో ఓ భారీ ఉగ్రదాడిని పోలీసులు భగ్నం చేశారు. హర్యానా ఫరీదాబాద్‌లోని ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, భారీగా ఆయుధాలు, బాంబు తయారీ భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

మూడు మ్యాగజైన్‌లతో అస్సాల్ట్ రైఫిల్, 83 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, ఎనిమిది లైవ్ రౌండ్ల పిస్టల్, రెండు ఖాళీ కార్ట్రిడ్జ్‌లు, రెండు అదనపు మ్యాగజైన్‌లు, 12 సూట్‌ కేసులు, పేలుడు పదార్థం ఉన్న బకెట్, 20 టైమర్లు, నాలుగు బ్యాటరీలు, రిమోట్‌లు, ఐదు కిలోగ్రాముల హెవీ మెటల్, ఒక వాకీ-టాకీ సెట్ ను పోలీసులు సీజ్ చేశారు. వీటిని భారీ ఉగ్రదాడికి ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలు సహాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కారులో అస్సాల్ట్ రైఫిల్ ను పోలీసులు గుర్తించారు.

నిందితుడు ఆమెకు తెలియకుండానే కారులో గన్ పెట్టాడా? అనే విషయంపై దర్యాప్తులో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్, సహరన్‌పూర్‌లలో అరెస్టుల తర్వాత పుల్వామాకు చెందిన మరో వైద్యుడు డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్‌ను జమ్ము కశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్

ఉగ్ర లింకుల నేపథ్యంలో అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముజమ్మల్ ను పది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముజమ్మల్ అరెస్టు తర్వాత, ఆదివారం ఫరీదాబాద్‌లోని అతని నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను నిల్వ చేయడానికి మాత్రమే నిందితుడు అదనపు గదిని అద్దెకు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు.

Also Read: UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

ఈ ఆపరేషన్ గురించి ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్, హర్యానా పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారతదేశంలో ఉగ్రదాడులు చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ కు చెందిన జైషే-మొహమ్మద్ మద్దతుదారులు పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×