E-Paper
Advertisement

The first tunnel railway: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

The first tunnel railway: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
Advertisement

First tunnel railway in Kashmir: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం (T-50) అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 12.77 కిలో మీటర్లు ఉంటుంది. జమ్మూ-కాశ్మీర్ లో ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన బనిహాల్-ఖడీ-సుంబడ్- సంగల్ దాన్ సెక్షన్ (14.1కి.మీ) ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ-సుంబడ్ ల మధ్య ‘ టీ-50’ సొరంగ మార్గం వస్తుంది. బారముల్లా రెండు విద్యుత్ రైళ్లకు జమ్మూ నుంచి వర్చువల్ గా పచ్చజెండా ఊపారు. అయితే కశ్మీర్ లోయలో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్డం ఇదే తొలిసారి.

‘టీ-50’ సొరంగం పొడవు 12.77 కి.మీ. బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సవాల్‌గా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. యూపీఏ హయాంలో 2010లోనే పనులు ప్రారంభించారు. దాదాపు 14 ఏళ్లకు అందుబాటులోకి వచ్చింది ఈ సొరంగ మార్గం. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ‘టీ-50’కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించారు. ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలను ఏర్పాటు చేశారు.

Advertisement

Read More: హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాసం.. ఫిబ్రవరి 22న చర్చ..

యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టును రూ.41 వేల కోట్లతో చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం పొడవు 272 కి.మీ. బారాముల్లా- సంగల్‌దాన్‌, ఉధంపుర్‌- కాట్రా సెక్షన్‌ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాట్రా- సంగల్‌దాన్‌ల మధ్య 63 కిలోమీటర్ల వరకు పనులు సాగుతున్నాయి.

Advertisement

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్‌ వంతెన’, దేశంలో తొలి తీగల రైలు వంతెన ‘అంజీఖాడ్‌’లు ఈ మార్గంలోనే ఉన్నాయి. తాజాగా బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌ ప్రారంభంతో కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలనే లక్ష్యానికి మరింత చేరువైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×