E-Paper
Advertisement

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!
Advertisement

Sonam Wangchuk: నీట్ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీల బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎలాంటి మధ్యంతర ఉపశమనం లభించలేదు. సఫ్దర్‌జంగ్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తన భర్తను ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా అనుమతించాలని ఆయన భార్య గీతాంజలి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సలహా మేరకే ఆసుపత్రికి తరలించారని, దీనిని ఏకపక్ష నిర్ణయంగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది.

వైద్యులదే తుది నిర్ణయం..

వాంగ్‌చుక్‌పై ఎలాంటి బలప్రయోగం జరగలేదని, ఆయన శారీరక స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగడం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఆయన ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య సిబ్బందికి సోనమ్ సహకరించాలని సూచించింది. చికిత్సకు సంబంధించిన తుది నిర్ణయాన్ని వైద్య బృందమే పర్యవేక్షిస్తుందని, వైద్య నియమావళి ప్రకారమే తదుపరి చర్యలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వ ఆసుపత్రి నివేదికలలో పారదర్శకత లేదని వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

ఆసుపత్రి నిర్బంధంపై లేఖ..

పోలీసులు జంతర్ మంతర్ నుంచి తనను బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా ఖండించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తనను ఉంచడాన్ని ఆయన ‘చట్టవిరుద్ధమైన నిర్బంధం’ (ఇల్లీగల్ డిటెన్షన్)గా అభివర్ణించారు. ఆసుపత్రి నుంచే తన భర్త పంపిన ఒక చేతిరాత లేఖను ఆయన భార్య గీతాంజలి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. పేపర్ లీకేజీల వంటి అన్యాయాల నుంచి విముక్తి, నిర్బంధాల భయం లేని భారతదేశం కోసం ఈ పోరాటం సాగుతోందని అందులో పేర్కొన్నారు.

రెండో స్వాతంత్ర్య ఉద్యమం..

Advertisement

కాక్‌రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జులై 20న పార్లమెంట్ రుతుపవన సమావేశాల మొదటి రోజున చేపట్టే ‘చలో సంసద్’ మార్చ్‌ను సోనమ్ వాంగ్‌చుక్ ‘భారతదేశ రెండవ స్వాతంత్ర్య ఉద్యమం’గా పేర్కొన్నారు. భయరహిత, అన్యాయ రహిత భారతదేశం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పౌరులు తరలివచ్చి ఈ పార్లమెంట్ మార్చ్‌ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాము ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఈ శాంతియుత నిరసన ర్యాలీ అనుకున్న ప్రకారం ముందుకు సాగుతుందని ఉద్యమకారులు స్పష్టం చేశారు.

Also Read: టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

 

 

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×