BigTV English

Bus Accident : ఒడిశాలో బస్సు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి

Bus Accident : ఒడిశాలో బస్సు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి

Bus Accident in Odisha(Today latest news telugu): ఒడిశా రాష్ట్రంలో సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కాగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.


హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మయూర్ భంజ్ జిల్లా బెత్నాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధిఖమర్ చౌక్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు వెనుక నుంచి ఆగి ఉన్న ట్రక్కు ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.


 

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×