BigTV English
Advertisement

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌ అంటే ప్రజల గళమని తెలిపారు. మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.


మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనానికి పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ఇప్పుడు ప్రారంభోత్సవ వేడుకలకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చరిత్రాత్మక కార్యక్రమాల్లో మాత్రం వారికి భాగస్వామ్యం కల్పించడం లేదన్నారు.

సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. వేడుకలను కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×