BigTV English

Rahul Gandhi : మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర..సైకిల్ తొక్కిన రాహుల్

Rahul Gandhi : మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా భారత్ జోడో యాత్ర..సైకిల్ తొక్కిన రాహుల్

Rahul Gandhi : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో ఉత్సాహంగా సాగుతోంది. ఇండోర్ నగరంలో సైకిలు తొక్కి రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చుట్టుముట్టి పూలవర్షం కురిపించారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో బైక్ నడిపారు రాహుల్ గాంధీ .


82వ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్‌లోని బడా గణపతి చౌరహా నుంచి తిరిగి ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలను పలకరిస్తూ రాహుల్‌ ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్నారు. సోమవారం బారోలి గ్రామం, కృష్ణా ఎన్‌క్లేవ్‌, తరణ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రికి సన్‌విర్‌ వద్ద రాహుల్‌ బస చేయనున్నారు.

రాహుల్ గాంధీ పాదయాత్ర కన్యాకుమారిలో ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. చిన్నారులు, యువతతో కలిసి ఆడటం, గిరిజనులతో కలిసి నృత్యం చేయడం, స్థానికులతో సరదాగా గడపడం ఇలా సాగుతోంది భారత్ జోడో యాత్ర. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర సాగనుంది. ఈ యాత్రలో ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలు, 34 జిల్లాలను చుట్టేశారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు 1,307 కిలోమీటర్ల దూరం నడిచారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×