BigTV English
Advertisement

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి కారణమిదే.. రైల్వే మంత్రి క్లారిటీ..!

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి కారణమిదే.. రైల్వే మంత్రి క్లారిటీ..!

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి మూల కారణాన్ని తెలుసుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ప్రకటించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలను రైల్వేమంత్రి పర్యవేక్షిస్తున్నారు.ఈ సమయంలో రైలు ప్రమాదంపై కీలక విషయాన్ని వెల్లడించారు.


రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ప్రమాదానికి కారణమైన తప్పిదాన్ని కనిపెట్టారని తెలిపారు. దీనికి బాధ్యులను కూడా గుర్తించారని చెప్పారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం పునరుద్ధరణ చర్యలపైనే దృష్టి పెట్టామన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అప్పటి నుంచి రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయన్నారు.ప్రస్తుతం రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మృతదేహాలను పూర్తిగా తొలగించామని తెలిపారు.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృత్యువాత పడ్డారు. 1,175 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.


Tags

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×