E-Paper
Advertisement

Odisha Train Accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. ఆడియో వైరల్..

Odisha Train Accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. ఆడియో వైరల్..
Advertisement

Odisha train accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం జరిగినట్లు… రైల్వే అధికారుల అంతర్గత విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన ఇద్దరు అధికారుల ఫోన్‌ కాల్ ఆడియో… ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తప్పిదం ఎలా జరిగిందో… స్థానిక అధికారుల ద్వారా ఉన్నతాధికారులు ఆరా తీశారు. సౌత్ వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్… ట్రాఫిక్ విభాగానికి చెందిన డిప్యూటీ చీఫ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ను, ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు.

ప్రమాదానికి ముందు ఘటనా స్థలంలో పని చేసిన రైల్వే సిబ్బంది… ఆ సమయంలో మెయిన్‌లైన్‌ను లూప్‌ లైన్‌కు కలిపారు. పని పూర్తయ్యాక తిరిగి పట్టాలను మెయిన్‌ లైన్‌కు కలపకుండా వదిలేశారు. ఆ విషయం గమనించకుండా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్టేషన్ మాస్టర్ మెయిన్‌లైన్‌లో గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రైలు మెయిన్‌లైన్‌లో దూసుకెళ్లింది.

Advertisement

ట్రాక్‌ లింక్‌ లూప్‌లైన్‌లోకి ఉండటంతో అటువైపే వెళ్లి, అప్పటికే ఆ ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును అతివేగంతో ఢీకొంది. దాంతో కోరమాండల్ బోగీలు డౌన్‌ మెయిన్‌లైన్‌పై పడిపోయాయి. ఆ బోగీలను హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో పెను విషాదం చోటు చేసుకుంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×