E-Paper
Advertisement

Odisha Train Accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. ఆడియో వైరల్..

Odisha Train Accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. ఆడియో వైరల్..

Odisha train accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం జరిగినట్లు… రైల్వే అధికారుల అంతర్గత విచారణలో బయటపడింది. దీనికి సంబంధించిన ఇద్దరు అధికారుల ఫోన్‌ కాల్ ఆడియో… ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తప్పిదం ఎలా జరిగిందో… స్థానిక అధికారుల ద్వారా ఉన్నతాధికారులు ఆరా తీశారు. సౌత్ వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్… ట్రాఫిక్ విభాగానికి చెందిన డిప్యూటీ చీఫ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ను, ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు.

ప్రమాదానికి ముందు ఘటనా స్థలంలో పని చేసిన రైల్వే సిబ్బంది… ఆ సమయంలో మెయిన్‌లైన్‌ను లూప్‌ లైన్‌కు కలిపారు. పని పూర్తయ్యాక తిరిగి పట్టాలను మెయిన్‌ లైన్‌కు కలపకుండా వదిలేశారు. ఆ విషయం గమనించకుండా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్టేషన్ మాస్టర్ మెయిన్‌లైన్‌లో గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రైలు మెయిన్‌లైన్‌లో దూసుకెళ్లింది.

ట్రాక్‌ లింక్‌ లూప్‌లైన్‌లోకి ఉండటంతో అటువైపే వెళ్లి, అప్పటికే ఆ ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌ రైలును అతివేగంతో ఢీకొంది. దాంతో కోరమాండల్ బోగీలు డౌన్‌ మెయిన్‌లైన్‌పై పడిపోయాయి. ఆ బోగీలను హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో పెను విషాదం చోటు చేసుకుంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×