Rajasthan: స్టేట్ టాపర్గా నిలిచి, ఎంతో మందికి రోల్ మోడల్గా నిలవాల్సిన ఒక యువ అధికారిణి.. సర్వీస్లోకి వచ్చిన ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్కు చెందిన కాజల్ మీనా ఉదంతం చూస్తుంటే, వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో దూసుకుపోతుందో అర్థమవుతోంది.
కాజల్ మీనా సామాన్యమైన వ్యక్తి కాదు. 2024లో జరిగిన రాజస్థాన్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఆమె స్టేట్ టాపర్. తన ప్రతిభతో గ్రూప్-1 స్థాయి ర్యాంక్ సాధించి, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (SDM) వంటి కీలకమైన బాధ్యతలను దక్కించుకున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కేవలం ఆరు నెలల క్రితమే ఆమె విధుల్లో చేరారు. ఇంత తక్కువ సమయంలోనే అవినీతి ఊబిలోకి దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
అసలేం జరిగిందంటే.. ఒక భూమికి సంబంధించిన ‘డిక్రీ’ జారీ చేయాల్సి ఉండగా, అందుకు ప్రతిఫలంగా కాజల్ మీనా 60 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా స్కెచ్ వేశారు. కాజల్ ఆ డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కష్టపడి చదివి, వేల మందిని వెనక్కి నెట్టి టాపర్గా నిలిచిన వ్యక్తికి.. కనీస విలువలు లేకపోవడం విచారకరం. ఆ స్థాయి అధికారిణికి వచ్చే జీతభత్యాలు, గౌరవం కంటే.. ఆ అరవై వేలే ముఖ్యం అనుకోవడం ఆమె వ్యక్తిత్వానికే కాదు, ఆ పదవికి కూడా అవమానం. ఈ ఘటనతో ఆమె కెరీర్ ప్రారంభంలోనే ముగిసిపోయినట్లయింది.
Also Read: సీఎం రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత.. 144 సెక్షన్ విధింపు.. బీజేపీ నిరసనలతో హై అలర్ట్!