E-Paper
Advertisement

కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!

కొత్తగా ఏదైనా చేయాలంటూ.. ఉరేసుకున్న నీట్ విద్యార్థి.. ఖంగుతిన్న పోలీసులు!
Advertisement

NEET Aspirant Dies: ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్దమవుతున్న 22 ఏళ్ల జతిన్ కుమార్.. అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21 ఆదివారం జరగనుండగా.. సరిగ్గా రెండ్రోజుల ముందు అంటే శుక్రవారం అతడు ప్రాణాలు విడిచాడు. అయితే చనిపోయే ముందు చిత్రీకరించిన వీడియోలో అతడు చెప్పిన మాటలు.. ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. ఘజియాబాద్ లోని విజయ్ నగర్ లో గల హెచ్ – బ్లాక్ లో జతిన్ కుమార్ నివసిస్తున్నాడు. వైద్య ప్రవేశ పరీక్ష (నీట్) కోసం అతడు గత కొద్దికాలంగా సిద్దమవుతున్నాడు. ఆదివారం రీ-ఎక్జామ్ ఉండటంతో గురువారం అర్ధరాత్రి వరకూ గదిలో చదువుకుంటూ జతిన్ కనిపించాడు. పరీక్షకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేకుండా అటు తిరుగుతూ ఉన్నాడని కుటుంబ సభ్యులు సైతం తెలిపారు. అయితే తెల్లవారుజామున జతిన్ నిద్రలేపడానికి అతడి గదికి వెళ్లగా.. అనూహ్యాంగా అతడు విగతజీవిగా కనిపించాడు.

Advertisement

దీంతో విజయ్ నగర్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందం హుటాహుటీనా ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఉరితాడు తెగిపోవడంతో జతిన్ కింద నేలపై నిర్జీవంగా కనిపించాడు. ఈ క్రమంలో గది అంతా గాలించగా.. పోలీసులకు జతిన్ ఫోన్ లభ్యమైంది. చనిపోయే ముందు జతిన్ వీడియో సైతం రికార్డు చేయడాన్ని పోలీసులు గుర్తించారు. అందులో జతిన్ మాట్లాడుతూ ‘ఈరోజు ఏదైనా భిన్నంగా (కొత్తగా) చేద్దామని ఆలోచిస్తున్నాను’ అని చెబుతూ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న ఉరితాడును చూపించాడు. అదే సమయంలో నీట్ పరీక్షకు సంబంధించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని, తన తండ్రి కూడా ఆందోళన చెందవద్దని చెప్పారని జతిన్ చెప్పుకొచ్చాడు.

Also Read: రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షం.. అన్నదాత సుఖీభవపై.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement

కాగా, జతిన్ ఆ కుటుంబానికి ఒక్కగానొక్క కొడుకు కావడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. జతిన్ తండ్రి ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, తల్లి హౌస్ వైఫ్ గా ఉంటోంది. తమ బిడ్డ ఇలా ఎందుకు చేశాడో తెలియక ప్రస్తుతం జతిన్ ఫ్యామిలీ పూర్తిగా షాక్ లో ఉంది. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. ప్రస్తుతం జతిన్ తీసుకున్న వీడియోను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఉపాసన పాండే తెలిపారు. జతిన్ బాడీని పోస్ట్ మార్టంకు పంపామని.. అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని ఆమె తెలిపారు.

Also Read: బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

Related News

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

లా స్టూడెంట్ అమృత హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్!

నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Big Stories

Advertisement
×