Bengaluru: కర్ణాటకలోని డీకే ప్రభుత్వం అప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టారు. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు వ్యవహారంపై దుమారం మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు రామలింగారెడ్డి.
కర్ణాటక డీకే ప్రభుత్వం చిన్న చిన్న తుపాన్లు
కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న తుపాన్లు వస్తుంటాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లేకున్నా నేతలు మాత్రం రాజీనామాలతో తమ అసంతృప్తిని బయటపెడుతుంటారు. తాజాగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి కూడా అదే చేశారు. సరైన పదవి దక్కని కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు మంత్రి రామలింగారెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డీకే శివకుమార్ మా ఇంటికి వచ్చారని తెలిపారు. బెంగళూరు పోర్ట్ఫోలియో ఇస్తామని చెప్పారని, ఆ సమయంలో తాను ఏ పోర్ట్ ఫోలియో అడగలేదన్నారు.
నచ్చిన పదవి ఇవ్వలేదని మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
ఆయన స్వయంగా ప్రతిపాదించడంతో తాను సరే అన్నానని అన్నారు వివరించారు. తనకు ఆ శాఖను ఇస్తామని రెండుసార్లు హామీ ఇచ్చారని, ఆ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారని వివరించారు. అది తనకు ఆమోదయోగ్యం కాదని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
తనకు నచ్చిన మంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించనని మనసులోని మాట బయటపెట్టారు రామలింగారెడ్డి. బెంగళూరు పోర్ట్ ఫోలియో ఇచ్చినా అంగీకరించనని, తాను ఎమ్మెల్యేగా ఉంటానని, కాంగ్రెస్తోనే ఉంటానని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి తన రాజీనామా వ్యవహారం సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది.
ALSO READ: తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు
రామలింగారెడ్డి సీనియర్ నాయకుడు, తనకు సన్నిహిత మిత్రడని, ఈ సమస్యను పరిష్కరించుకుంటానని అన్నారు. రామలింగారెడ్డి తన రాజీనామా వ్యవహారం సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది. రామలింగారెడ్డి సీనియర్ నాయకుడు, తనకు సన్నిహిత మిత్రడని, ఈ సమస్యను పరిష్కరించుకుంటానని అన్నారు.
గురువారం రాత్రి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రి వర్గంలోని 13 మంది శాఖలను కేటాయించారు. బెంగళూరు అభివృద్ధి శాఖ విషయంలో రామలింగారెడ్డి పట్టుబట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ముఖ్యమంత్రి నిరాకరించారని తెలిపాయి. పోర్ట్ ఫోలియోలను ఖరారు చేసేందుకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రామలింగారెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.