E-Paper
Advertisement

Skydeck In Bengaluru: బెంగళూరులో భారీ స్కై డెక్..250 మీటర్ల ఎత్తునుంచి నగరాన్ని వీక్షించవచ్చు

Skydeck In Bengaluru: బెంగళూరులో భారీ స్కై డెక్..250 మీటర్ల ఎత్తునుంచి నగరాన్ని వీక్షించవచ్చు
Advertisement

South Asia’s Tallest Skydeck Worth ₹ 500 Crore To Come Up In Bengaluru: ఆకాశంలో పక్షిలా విహరిస్తూ చుట్టుపక్కల సుందర దృశ్యాలను చూడాలని ఎవరికి ఉండదు. మనకు కూడా ఆ క్షణంలో రెక్కలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అయితే ఇకపై మీరు అలా చూడాలని అనుకుంటే బెంగళూరు వెళ్లాల్సిందే.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఓ బృహత్ భారీ ప్రణాళిక రూపుదిద్దుకోనుంది. ఈ భారీ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం రూ.500 కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన బెంగళూరు ప్రాంతం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కై డెక్ తో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోబోతోంది. ఇకపై పర్యాటకంగా మరింత శోభను సంతరించుకోబోతోంది.

Advertisement

నగరానికే తలమానికం

బెంగళూరుకే తలమానికంగా రూపుదిద్దుకోనున్న స్కైడెక్ ను అధిరోహించి చుట్టూ 360 డిగ్రీల వ్యూహంతో సిటీ మొత్తాన్ని సందర్శించవచ్చు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ మాదిరిగా దీనిని అత్యాధునిక సాంకేతిక విలువలతో నిర్మించనున్నారు. లోపల లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. 250 కిలో మీటర్ల ఎత్తు నుంచి సిటీని చూడవచ్చు. న్యూఢిల్లీ వద్ద ఉన్న కుతుబ్ మినార్ 73 మీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ స్కై డెక్ మాత్రం అంతకు మూడింతలు ఎక్కువగా ఉండనుంది.

Advertisement

స్కైడెక్ దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తయిన ప్రాజెక్టు. పర్యాటక రంగానికి ఊతమిచ్చే క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గార్డెన్ సిటీ అందాలను పై నుంచి చూడగలిగే భాగ్యం స్కైడెక్ ద్వారా కలగనుంది. ఇలాంటి గర్వపడే ప్రాజెక్టు భారతదేశం మొత్తం మీద తమ నగరానికే పరిమితం కావడం పట్ల స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

Big Stories

Advertisement
×