BigTV English

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పది లక్షల దీపాలతో అలంకరించనున్నట్లు రామజన్మభూమి ట్రస్టు సభ్యులు తెలిపారు. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయోధ్యలోని ముఖ్యనగరాలు అయిన రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, సరయు ఘాట్‌, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ, లతా మంగేష్కర్‌ చౌక్‌ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని వెల్లడించారు.


శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయోధ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1.71 లక్షల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు చేరింది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

.


.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×