E-Paper
Advertisement

ప్రధాని మోదీ హత్యకు కుట్ర? CIAతో డీల్? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్

ప్రధాని మోదీ హత్యకు కుట్ర? CIAతో డీల్? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్
Advertisement

PM Narendra Modi Assassination Plot: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశా పరారీ గ్రామంపై అర్థరాత్రి దాడి చేసిన పోలీసులు అమన్ కుమార్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు జిల్లా పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితులు ప్రధానమంత్రి కార్యాలయం (PMO)కి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో నిందితులు విదేశీ గూఢచారి సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నార‌న్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అమన్ కుమార్ అనే నిందితుడు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)కి సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానమంత్రిపై దాడి చేసేందుకు తనకు 22 రోజుల సమయం కావాలని అలాగే ఇందుకోసం భారీ మొత్తంలో నగదును అందజేయాలని ఆ సందేశంలో కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

Advertisement

అరెస్టయిన వారి ఇళ్లపై దాడులు నిర్వహించిన సమయంలో పోలీసులు ల్యాప్‌టాప్‌లు.. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు తారుమారు కాకుండా కొన్ని గదులను సీల్ చేశారు. స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. నిందితులు జరిపిన కమ్యూనికేషన్లను ధృవీకరించడానికి అలాగే వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ కుట్ర వెనుక ఏవైనా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు అమన్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలు విన్న అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అమన్ కుమార్ చాలా సాధారణ వ్యక్తి అని ఎవరితోనూ గొడవలకు వెళ్లేవాడు కాదని వారు చెబుతున్నారు. రాత్రి భోజనం సిద్ధం చేసుకుంటున్న సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు ఎటువంటి కారణం చెప్పకుండా అతడిని తీసుకెళ్లారని అమన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమ గ్రామానికి చెందిన యువకుడు ఇలాంటి భారీ కుట్రలో ఎలా భాగస్వామి అవుతాడని స్థానికులు పోలీసుల వాదనను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు స‌మాచారం.

Advertisement

Read Also: బెంగళూరులో జాంబీ డ్రగ్ కలకలం.. నిలబడ్డ చోటే ఘోరం? అసలు నిజాలు బయటపెట్టిన పోలీసులు

Related News

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

Big Stories

Advertisement
×