E-Paper
Advertisement

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Goods carrier derails near Mathura in Uttar Pradesh: దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రయాణిస్తున్నారు. గత కొంతకాలంగా రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది కావాలని దాడులు చేస్తుండగా.. మరోవైపు సాంకేతిక లోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని రాత్రి 8 గంటలకు ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

వివరాల ప్రకారం.. యూపీలోని బృందావన్ రోడ్ స్టేషన్ సమీపంలో ఓ బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే దాదాపు 20కు పైగా బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆ రూట్‌ను క్లియర్ చేసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

యూపీలోని బృందావన్ రోడ్ సమీపంలో గూడ్స్ రైలుకు చెందిన 20 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీ- మథుర మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని నేషనల్ క్యాపిటల్ రీజియన్ రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆ మార్గాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.

Also Read: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

ఇదిలా ఉండగా, ఇటీవల భోపాల్ సమీపంలోని మిస్రోడ్, మండిదీప్ రైల్వే స్టేషన్ల మధ్య ఓ గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే మరో ప్రమాదం జరగడంతో పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి.

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×