E-Paper
Advertisement

Udhayanidhi Stalin: హిందీ అంటే భాషలను మింగేసే రాక్షసి.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు..

Udhayanidhi Stalin: హిందీ అంటే భాషలను మింగేసే రాక్షసి.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు..
Advertisement

Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ “హిందీ రుద్దుడు”  పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా హిందీ భాష అనేక ప్రాంతీయ మాతృభాషలను “మింగేస్తోందని” ఆయన హెచ్చరించారు. ఆదివారం జరిగిన ‘భాషా ఉద్యమ అమరవీరుల స్మారక దినోత్సవం’లో పాల్గొన్న ఆయన, 1960లలో హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిపాదిస్తున్న ‘త్రిభాషా సూత్రం’  పై డిఎంకె ప్రభుత్వ దృఢమైన వ్యతిరేకతను ఆయన మరోసారి స్పష్టం చేశారు. హిందీ ప్రాబల్యం పెరగడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లోని అనేక మాతృభాషలు తమ ఉనికిని కోల్పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఉత్తర భారత రాష్ట్రాల్లో హిందీ ప్రవేశించడం వల్ల హర్యానాలో హర్యానవీ, బీహార్‌లో భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు క్రమంగా అదృశ్యమయ్యాయని ఉదయనిధి వాదించారు. ఒక భాషా ఆధిపత్యం ప్రాంతీయ గుర్తింపును మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. “ఈరోజు చాలా రాష్ట్రాల్లో వారి మాతృభాష కనుమరుగైంది. ప్రజలు తమ సొంత భాషను మరచిపోయేలా హిందీ చేస్తోంది. అందుకే తమిళ సంస్కృతిని, భాషను కాపాడుకోవడానికి మా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హిందీ రుద్దుడును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు” అని ఉదయనిధి స్పష్టం చేశారు. తమిళనాడులో అమలులో ఉన్న ద్విభాషా విధానమే రాష్ట్రాన్ని విద్య, పరిశ్రమలు, ఆరోగ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపిందని ఆయన సమర్థించుకున్నారు.

Advertisement

ఇదే క్రమంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో హిందీని జొప్పించి “సాంస్కృతిక దాడి” కి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయనందుకు తమిళనాడుకు రావాల్సిన రూ. 3,458 కోట్ల కేంద్ర నిధులను నిలిపివేయడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆయన విమర్శించారు. నిధులు నిలిపివేసినా, ఎన్ని కోట్లు నష్టపోయినా త్రిభాషా సూత్రానికి తాము తలొగ్గేది లేదని, అధికారానికి, డబ్బుకు లొంగిపోయే బానిసలం కాదని స్టాలిన్ ఘాటుగా స్పందించారు. అన్నాదురై, కరుణానిధిల వారసత్వాన్ని తాము కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.

తమిళనాడులో దశాబ్దాలుగా అమలులో ఉన్న ద్విభాషా విధానం వల్ల విద్యార్థులు మాతృభాషలో ఆలోచించగలుగుతున్నారని, అలాగే ఇంగ్లీష్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం అవుతున్నారని డీఎంకే ప్రభుత్వం భావిస్తోంది. హిందీని తప్పనిసరి చేస్తే పాఠశాలల్లో డ్రాపౌట్ రేట్లు పెరుగుతాయని, హిందీ రాని వారు తమ సొంత రాష్ట్రంలోనే “రెండవ తరగతి పౌరులు” గా మారిపోయే ప్రమాదం ఉందని వారు వాదిస్తున్నారు. మరో మూడు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, భాష, తమిళ గుర్తింపు అంశాలు డీఎంకే, బీజేపీ మధ్య ప్రధాన రాజకీయ పోరాట వేదికగా మారాయి.

Advertisement

Read Also: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో వాయుసేన అదిరిపోయే వీడియో.. మన జవాన్ల పరాక్రమాన్ని చూసి తీరాల్సిందే! 

Related News

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

Big Stories

Advertisement
×