E-Paper
Advertisement

Greater Noida : భారీ వర్షానికి కూలిన పై కప్పు.. ముగ్గురు చిన్నారులు మృతి

Greater Noida : భారీ వర్షానికి కూలిన పై కప్పు.. ముగ్గురు చిన్నారులు మృతి
Advertisement

Builing Roof Collapsed in Greater Noida : నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలడంతో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఖోడ్నా కలాన్ గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పిల్లలు నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడుకుంటుండగా.. దాని పై కప్పు కూలిపోయినట్లు గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమిషనర్ సునీతి అధికారిక ప్రకటనలో తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భవనం పై కప్పు శుక్రవారం సాయంత్రం కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి గోడ పునాది నానిపోయి బలహీనంగా మారడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

స్థానిక నివాసి అయిన సఘీర్ నిర్మించుకుంటున్న ఇంటి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూలిన పై కప్పు శిథిలాల కింద 8 మంది చిక్కుకున్నారని, వారిలో ముగ్గురు చనిపోయారని వైద్యులు ప్రకటించారు. మిగిలిన ఐదుగురు చిన్నారులకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనపై విచారణ జరుపుతున్నామని గౌతమ్ బుద్ధనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అతుల్ కుమార్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు.

 

Related News

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

Big Stories

Advertisement
×