E-Paper
Advertisement

Fire Accident: ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

Fire Accident: ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం..  ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Fire Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా జోషిమఠ్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా..  సైనిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జోషిమఠ్ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది కావడంతో..  అక్కడ ఉన్న ఆర్మీ క్యాంప్‌లో మంటలు చెలరేగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

 జోషిమఠ్‌లో ఉన్న ఆర్మీ  క్యాంప్‌లోని ఒక స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పక్కనే ఉన్న ఇతర విభాగాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని భావించిన సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాథమికంగా సైనిక సిబ్బంది తమ వద్ద ఉన్న పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ కొండ ప్రాంతం కావడం.. చలి తీవ్రత ఉన్నప్పటికీ…  సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలు ఇతర నివాస ప్రాంతాలకు లేదా ఆయుధ గారాలకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం మంటలు క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం సంభవించింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్టోర్ రూమ్‌లో ఉన్న ఫర్నిచర్, రికార్డులు లేదా ఇతర సైనిక సామాగ్రి కాలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే..  ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. క్యాంప్‌లో ఉన్న విద్యుత్ వైరింగ్‌లో లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఆర్మీ ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత నష్టాన్ని అంచనా వేస్తామని..  అలాగే ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న జోషిమఠ్‌లో ఇటువంటి ప్రమాదాలు జరగడం భద్రతా పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Tirumala: జల్లికట్టు వేడుకలలో అపశృతి.. తలకాయ పగిలి తీవ్ర స్థితిలో..?

Related News

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

Big Stories

Advertisement
×