Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఇండస్ట్రీలో ఈ చిన్నదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి.
యూట్యూబర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన వైష్ణవి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో హీరోకు చెల్లిగా నటించి మెప్పించింది.
ఇక ఈ సినిమా తరువాత వైష్ణవికి బేబీ సినిమా ఆఫర్ వచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు.
బేబీ సినిమా వైష్ణవిని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. పల్లెటూరు అమ్మాయి పట్నం వచ్చి ఇద్దరు అబ్బాయిలను ఎలా మోసం చేసింది.. ? అనే కథతో తెరకెక్కిన బేబీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
బేబీ సినిమా తరువాత వైష్ణవి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది.
సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ అనే సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ఇక ఈ తెలంగాణ పిల్ల సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
తాజాగా వైష్ణవి ఈ ఏడాది చివరి రోజున కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఇయర్ లో ఆమె ఎన్నో ఫోటోలు దిగగా.. ప్రతి నెలలో ఒక్కో ఫోటోను షేర్ చేసింది.
కొన్ని ఫొటోస్ వెకేషన్స్ లో ఉన్నప్పుడు.. మరికొన్ని పండగలప్పుడు దిగినట్లు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా చీరకట్టులో స్వామివారికి సేవ చేస్తున్నట్లు ఉన్న ఫోటో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం వైష్ణవి చైతన్య ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి వచ్చే ఏడాది అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.