Flipkart Black Friday Sale: ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025పై వినియోగదారుల్లో నెలరోజుల ముందే ఆసక్తి భారీగా పెరిగింది. దీపావళి సేల్ ముగిసిన వెంటనే భారీ కొనుగోలు తరంగం ఈ సేల్పైకి వచ్చే అవకాశం ఉందని ఫ్లిప్కార్ట్ ముందుగానే అంచనా వేసి, ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. సంవత్సరం చివరిలో జరిగే ఈ భారీ సేల్కు ఫ్లిప్కార్ట్ ముందుగానే భారీగా ప్రిపరేషన్ చేస్తోంది. సైట్లో బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్ అనే ట్యాగ్లైన్లతో వినియోగదారులకు ఆకట్టుకునేలా చేస్తుంది. ఈసారి ఫ్లిప్కార్ట్ ఆఫర్లు గత సంవత్సరం కన్నా మరింత ఎక్కువగా, విస్తృతంగా ఉంటాయని సంకేతాలు ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఇంటికి కావలసిన వస్తువులు.. ఫ్యాషన్, ఫర్నిచర్ సుమారు ప్రతి విభాగంలో ఫ్లిప్కార్ట్ భారీ తగ్గింపులు అందించడానికి సిద్ధమైంది.
ప్రముఖ బ్రాండ్లపై 45 నుండి 55 శాతం
స్మార్ట్ఫోన్ కేటగిరీ ఈ సేల్లో ప్రధాన హైలైట్గా నిలవనుంది. ప్రముఖ బ్రాండ్ల తాజా మోడళ్లకు 45 నుండి 55 శాతం వరకు తగ్గింపులు పెట్టే అవకాశముంది. అందులోనూ పూర్వ తరం మోడళ్లకు ధరలను మరింత తగ్గించి మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్లుగా మార్చేందుకు ఫ్లిప్కార్ట్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిసి ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉన్నందున, స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ అత్యంత సరైన సమయంగా మారబోతోంది.
ల్యాప్టాప్లపై 40 నుంచి 50 శాతం
ల్యాప్టాప్లు, అల్ట్రాబుక్లు, క్రోమ్బుక్లపై ఈసారి పెద్ద మొత్తంలో తగ్గింపులు కనిపించనున్నాయి. వర్క్-ఫ్రమ్-హోమ్ కల్చర్ కొనసాగుతున్న నేపథ్యంలో, విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 40 నుంచి 50 శాతం తగ్గింపులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పవర్ఫుల్ ప్రాసెసర్లతో ఉన్న మోడళ్లపై అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా ఇవ్వాలని ఫ్లిప్కార్ట్ ప్రణాళిక చేసింది. గేమింగ్ ల్యాప్టాప్లు, హై-ఎండ్ మోడళ్లకు కూడా డిమాండ్ పెరుగుతున్నందున, ఈ విభాగంలో కూడా ప్రత్యేక ఆఫర్లు రానున్నాయి.
స్మార్ట్ టీవీలపై 35 నుంచి 60 శాతం
టీవీలు, టాబ్లెట్లు, సౌండ్బార్లు వంటి వినోద పరికరాల విభాగాల్లో కూడా ఈసారి భారీ తగ్గింపులు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్ టీవీలపై 35 నుంచి 60 శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉంది. నాలుగు కె, క్యూ ఎల్ఈడి వంటి ప్రీమియం టీవీలకూ ఈసారి ఆకర్షణీయమైన ధరలు ఇవ్వనున్నారు. సౌండ్బార్లు, హోమ్ థియేటర్ పరికరాలకు 30 నుండి 50 శాతం వరకు తగ్గింపులు పెట్టేందుకు కంపెనీ ముందుగానే ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. టాబ్లెట్ సెగ్మెంట్లో కూడా 25 నుంచి 40 శాతం తగ్గింపులు ఇవ్వడం ద్వారా స్టూడెంట్లు, హెచ్ఓఎం వినియోగదారులు మరింత లాభపడే అవకాశం ఉంది.
వింటర్ సీజన్ వస్తులపై 30 నుండి 55 శాతం
శీతాకాలంలో వినియోగదారులు అత్యవసరంగా కొనుగోలు చేసే గీజర్లు, హీటర్లు, హై-కెపాసిటీ వాషింగ్ మెషీన్లకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది ఫ్లిప్కార్ట్. ఈ మూడు వర్గాల్లో 30 నుండి 55 శాతం వరకు ఆఫర్లు ఉండనున్నాయి. హీటర్లు, గీజర్లకు డిమాండ్ పెరుగుతుందని ముందుగానే అంచనా వేసి స్టాక్ను పెంచినట్లు ఐతే వార్తలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఫ్రిజ్లు, మైక్రోవేవ్లు, కిచెన్ పరికరాలపైనా 25 నుండి 60 శాతం వరకు తగ్గింపులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఫర్నిచర్, గృహ అలంకరణ, మ్యాట్రస్ల వంటి ఉత్పత్తులపైనా ఈసారి ఎక్కువగా తగ్గింపులు వచ్చే అవకాశం ఉంది. దుస్తులు, ఫ్యాషన్ విభాగంలో అయితే 40 నుండి 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉండేలా ప్రత్యేక విభాగం సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆఫర్లు ఏమైనా ఉన్నాయా?
అదనంగా, ఫ్లిప్కార్ట్ ప్రముఖ బ్యాంక్లతో కలిసి ప్రత్యేక తగ్గింపులు కూడా ప్రకటించబోతుంది. డెబిట్/క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్తో పాటు యూపీ ఐ లావాదేవీలపై అదనపు ఆఫర్లు కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కలిపితే ఉత్పత్తులపై ఇచ్చే తగ్గింపులు మరింత పెరిగి వినియోగదారులకు భారీ లాభాలను అందిస్తాయి.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 నవంబర్ 23న ప్రారంభమై నవంబర్ 27తో ముగియనుంది. మొత్తం ఐదు రోజులపాటు ఈ సేల్ కొనసాగుతుంది. మొదటి రోజున ఎర్లీ బర్డ్ డీల్స్, రెండవ రోజు నుంచి బిగ్ బ్రాండ్ ఆఫర్లు, చివరి రెండు రోజుల్లో భారీ క్లియరెన్స్ డీల్స్ రావడం వల్ల ప్రతి రోజూ ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉండనున్నాయి.
విష్లిస్ట్లో ముందుగానే సెలెక్ట్ చేసుకోండి
సేల్ ప్రారంభానికి ముందే మైక్రోసైట్ను అప్డేట్ చేస్తూ, వినియోగదారులు తమకు కావాల్సిన ఉత్పత్తులను విష్లిస్ట్లో ముందుగానే చేర్చాలని ఫ్లిప్కార్ట్ సూచిస్తోంది. ఎందుకంటే స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, గీజర్లు వంటి ఉత్పత్తులు మొదటి రోజుల్లోనే స్టాక్ అయిపోవచ్చు. గత ఏడాదికంటే తగ్గింపులు ఎక్కువగా ఉండటం వల్ల, ఈసారి బ్లాక్ ఫ్రైడే సేల్ వినియోగదారులకు అత్యంత లాభదాయకమైన షాపింగ్ ఈవెంట్గా మారనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.